- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దోహాలో ఉన్న భారతీయుల కోసం ఇండయ్ ఎంబసీ అత్యవసర ప్రయాణ సూచనలు జారీ చేసింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. అనధికారిక వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితి అయితే తప్పా బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని భారతీయులకు సూచించింది. పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ హెచ్చరించింది.
- Advertisement -



