విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఇలాంటి సినిమాలు సైలెంట్గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అలాగే అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మా చిత్ర ఫస్ట్లుక్ను ఆవిష్కరించిన రాజేంద్రప్రసాద్కి హదయపూర్వక కృతజ్ఞతలు.
ఆయన అభినందనలు మాకు మరింత నమ్మకం, ఉత్సాహం ఇచ్చాయి. అదే ఉత్సాహంతో సినిమాను మరింతా అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నాం’ అని దర్శకుడు అనిల్ కుమార్ పల్లా తెలిపారు. నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ.. ఇది ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మా టీమ్లో ప్రతి ఒక్కరు అద్భుతంగా తమ ప్రతిభను చూపుతున్నారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయేలా అవుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని తెలిపారు. బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఊరికూటి తాతారావు, పల్లా సత్యనారాయణ, సంగీతం: సుభాష్ ఆనంద్.
భావోద్వేగాలు… జీవిత సత్యాలు
- Advertisement -
- Advertisement -