Monday, November 10, 2025
E-PAPER
Homeఖమ్మంఅక్షరాస్యత తోనే సాధికారత: ఎంపీడీఓ అప్పారావు

అక్షరాస్యత తోనే సాధికారత: ఎంపీడీఓ అప్పారావు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అక్షరాస్యత తోనే ఎవరికైనా సాధికారత వస్తుందనీ ఎంపీడీఓ బి.అప్పారావు అన్నారు. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా వయోజనులను  అక్షరాస్యులుగా చేసే ఉల్లాస్  కార్యక్రమం భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమ్మకు అక్షరమాల పేరుతో ప్రారంభమైన కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని ఊట్లపల్లి లో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆధునిక కాలంలో విద్య లేకపోవడం అనేక అనర్ధాలకు దారి తీస్తుంది అని,అందువల్ల వయోజనులైన నిరక్షరాస్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సర్టిఫికెట్ కూడా పొందవచ్చునని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మండల అధికారి ప్రసాదరావు,ఎంపీఓ రెడ్డం కోటా రెడ్డి,సెర్ప్ ఏపీఎం దేవమణి లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -