- Advertisement -
నవతెలంగాణ చర్ల: ఛత్తీస్గఢ్లోని బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్లు మృతి చెందారు. బుధ, గురువారాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -



