Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అలరించిన ఫుడ్ ఫెస్టివల్ 

అలరించిన ఫుడ్ ఫెస్టివల్ 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక: అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ లో శనివారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ పలువురిని అలరించింది. విద్యార్థులు స్వయంగా చేసిన పలు రకాల పిండి వంటలు, ఆహార పదార్థాలు, స్వీట్లను కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభాకర్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ లు రుచి చూసి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఆసక్తితో పాటు మరింత నేర్చుకునే తత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్యామల, ఎంపీపీఎస్ హెచ్ఎం జాన్ కుమార్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, మాడుగుల శ్రీనివాస్, రాజేశం, కూరాకుల శ్రీనివాస్, అమృత్, నర్మదా, మౌనిక, పూజారి మల్లేశం పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -