- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో పాటు వంద రోజులు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా గురువారం అశ్వారావుపేట పురపాలక సంఘం ఆద్వర్యంలో పట్టణంలో హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంతికుంట కాలనీ నుండి గంగారం వెళ్ళు రోడ్డుకు ఇరువైపుల పండ్ల మొక్కలను నాటారు. అనంతరం సిబ్బంది గ్రామస్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అప్పన్న, రమణ, నాగేశ్వరావు, ఉలవల మురళీ, నందు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -