– ఎంఎస్సి చేసి సర్పంచ్ గా గెలిచాడు
నవతెలంగాణ- మంచిర్యాల : దండేపల్లి మండలం కర్నపేట గ్రామానికి చెందిన అజ్మీర సుభాష్ నాయక్ ఉన్నత చదువులు (ఎంఎస్స్సి, పీజీ ) పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం సాధించినప్పటికీ తన గ్రామ ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. అదే లక్ష్యం తో 2025 సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా భరిలో నిలిచి కర్నపేట తండా సర్పంచ్ అభ్యర్థి గా 6 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు .కర్నపేట గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి నన్ను సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి, సర్పంచ్ గా గెలిచిన సుభాష్ నాయక్ గెలుపు పట్ల గ్రామస్తులు ,రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
ఉన్నత చదువులు చదివినా … గ్రామానికి సేవ చేయాలని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



