- Advertisement -
నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం సీజ్ చేసిన 6 వాహనాలను వేలం ద్వారా 1,04,548 రూపాయల ఆదాయం వచ్చినట్లు తుంగతుర్తి ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు ట్రాన్స్పోర్ట్ సీఐ స్టీఫెన్ సన్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు.వివిధ నేరాల కింద సీజ్ చేసిన 7 ద్విచక్ర వాహనాలకు వేలంపాట వేయగా 6 వాహనములు వేలం వేయబడినవని తెలిపారు.ఎంవీఐ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు.ఈ వేలంపాటలో ఎక్సైజ్ ఎస్ఐలు మూర్తి, జయప్రకాష్,సిబ్బంది ఇబ్రహీం,ఆంజనేయులు,మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -