నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధం కారణంగా బంగారం ధర తగ్గడం సామాన్యులకు ఎంతో ఊరటనిస్తోంది. సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఉన్నవారికి పెద్ద ఊరటనిస్తోంది.హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ రెండోసారి తగ్గాయి. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.770 తగ్గగా తాజాగా రూ.980 పడిపోయింది. ఇవాళ మొత్తం రూ.1,750 దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రా. బంగారం రూ.1,61,130గా ఉంది. అటు 22 క్యారెట్ల 10 . ໕ ໕ 5.1,600 5 5.1,47,700 పలుకుతోంది. కేజీ వెండి రేటు రూ.2.90 లక్షలుగా ఉంది.
బంగారం ధర తగ్గినా, వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. అయితే నగరాల వారీగా ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలలో కిలో వెండి ధర రూ. 2,85,000 వద్ద కొనసాగుతోంది.



