మండల అధ్యక్షుడు బొలుదేవేందర్
నవతెలంగాణ – తాడ్వాయి
ఇందిరమ్మ ఇండ్ల పంపిణి పై అసత్య ఆరోపణలు చేయడం సరైనది కాదని, తప్పుడు ఆరోపణ చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్ల కలను దశలవారీగా నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం అని, అది నిరంతర ప్రక్రియ అని, వాటిపై తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ములుగు జిల్లాకు 3500 ఇందిరమ్మ ఇల్లు తో పాటు అదనంగా 1500 ఇండ్లు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క దే అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ దే అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ క్వారీలు నడుస్తున్నాయని, ఇసుక రవాణా చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పూటకో పార్టీ మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్న మీరు ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రజా ప్రభుత్వం పై ఓరవలేక తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు పాక సాంబయ్య, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ముజఫర్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, మాజీ ఎంపీపీ ఎనగంటి లక్ష్మయ్య, డైరెక్టర్లు సిద్ది రెడ్డి, జగన్, నాయకులు గౌని మధు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అసత్య ఆరోపణలు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES