Monday, July 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ఎదుట రైతుల ఆందోళ‌న‌

ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ఎదుట రైతుల ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ఉద్రిక్త‌త నెల‌కొంది. ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు ఉదయం తెల్లవారుజామునే కృయిజర్లు, ట్రాక్టర్లు కట్టుకొని తిరుమలహిల్స్‌లోని ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రంగారెడ్డి ఇంటి ముందు సుమారు 300 మంది రైతులు, మహిళలు, యువకులు బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు.

ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఫార్మా బాధిత రైతులకు ఎమ్మెల్యే రంగారెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఫార్మా బాధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ హామీ నెరవేర్చక పోవడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. ఫార్మాసిటీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఫార్మా కు ఇవ్వని 2500 ఎకరాల భూమిని తిరిగి రైతుల పేరిట ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుండి ఇట్టి భూములను వెంటనే తొలగించాలని కోరారు. రైతులకు రైతు భరోసా, రైతు భీమా, పంట రుణం, రుణమాఫీ, రైతులు భూమిని అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ అయ్యేలా వసతి కల్పించాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -