మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల – సమ్మయ్య
నవతెలంగాణ – కాటారం
పత్తి రైతులు పత్తిని అమ్ముకొనుటకు సూచనలు తెలియజేస్తున్న పోస్టర్లను ఆవిష్కరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కాటారం చైర్పర్సన్ పంతకాని తిరుమల- సమ్మయ్య గారు ఆవిష్కరించారు. కాటారం కేంద్రం లో గల మార్కెట్ కమిటీ ఆఫీస్ లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల మాట్లాడుతూ…రాష్ట్రమంతా ఈ నెల చివరి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతున్న దృష్ట పత్తి రైతులు పత్తిని అమ్ముకోవడానికి సెంటర్లు కు వెళ్లే ముందుగానే కపాస్ కిసాన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి స్లాట్ బుక్ చేసుకొని పత్తిని ఇష్టమైన మిల్లుకు విక్రయించడానికి సౌలభ్యంగా ఉన్నదని అన్నారు. ఆధార్ లింక్ తోనే డబ్బులు రైతు ఖాతాలో జమవుతాయని తెలియజేశారు. రైతులందరూ ముందుగానే ఆధార్ కార్డును కావలసిన బ్యాంకుకు లింకు చేసుకోవాలన్నారు. దళారుల వద్ద పత్తిని రైతులు ఎట్టి పరిస్థితిలో అమ్మ రాదని తెలిపారు.
పత్తికి మద్దతుధర 2025-26 సంవత్సరంలో క్వింటాల్ కు 8110/- తేమ 8 నుంచి 12 మధ్యలో ఉండవలెనని తెలిపారు.ఈ సంవత్సరం సక్రమంగా పత్తి కొనుగోలు జరిగేలాగా మన ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పిల్ల మరి రమేష్ , ఆత్మకూరు కుమార్ యాదవ్, ఏఎంసీ కార్యదర్శి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.