కాటారం తహశీల్దార్ నాగరాజు
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు కాటారం మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తహశీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ సదస్సులను రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో భూ యజమానులు రైతులు తమ భూమి రికార్డుల యందు ఏమైనా తప్పులు ఉన్న లేదా అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల యందు పేర్లు నమోదు కాకపోయినా, ఏ ఇతర భూ సమస్యలున్న ఈ నెల 3 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులో రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES