- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. పృథ్వినాథ్ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదం పరాసరాయ్-ఆలవాల్ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాల్వ వంతెన వద్ద చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సరయూ నది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు.
- Advertisement -