నవతెలంగాణ – నైజీరియా : నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుండి బస్సు అదుపుతప్పి పడిపోవడంతో 21మంది మరణించారు. వారిలో యువ క్రీడాకారులు, సీనియర్ జర్నలిస్టు, వైద్య సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్ అధికారుడు, క్రీడా నిర్వాహకులు ఉన్నారు. ఈ దుర్ఘటన గత శనివారం జరిగింది.
నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో జాతీయ క్రీడలను ముగించుకుని తిరిగి కోస్టల్ బస్సులో 36 మంది బయలుదేరారు. కోస్టల్ బస్సు రాత్రంతా ప్రయాణించి ఉదయం 9 గంటల సమయంలో కానోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దకాసోయే పట్టణం వద్ద ఓ వంతెనపై నుండి అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
మిగతా 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి అధికార యంత్రాంగం చేరుకుంది. గాయపడినవారిని కురా జనరల్ హాస్పిటల్, ముర్తాలా మొహమ్మద్ స్పెషలిస్ట్స్ హాస్పిటల్, కానోలకు తరలించారు. మరణించినవారిలో యువ క్రీడాకారులు, సీనియర్ జర్నలిస్టు, వైద్య సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్ అధికారుడు, క్రీడా నిర్వాహకులు ఉన్నారు. ఈ ఘోర దుర్ఘటనను మరో బస్సులో ప్రయాణిస్తున్న సీనియర్ క్రీడా జర్నలిస్టు ఆడో సలిసు ధ్రువీకరించారు. అధికారులు ఇంకా అధికారికంగా కారణాలు వెల్లడించనప్పటికీ. అక్కడి రహదారి పరిస్థితులు, అలాగే రాత్రంతా ప్రయాణం చేయడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. నైజీరియా క్రీడా సంఘాలు ఈ ఘోర దుర్ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అంతరాష్ట్ర ప్రయాణాల్లో క్రీడాకారుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులు, సహచరులు కలిసి తామంతా కోల్పోయిన ప్రతిభను స్మరించుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. నైజీరియా క్రీడల అభివఅద్ధిలో వారికి చేసిన సేవలను గుర్తు చేస్తూ దేశమంతటా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.