- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానాలోని సోనిపట్ జిల్లాలో మహిళా యూట్యూబర్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. జింద్ జిల్లాకు చెందిన యూట్యూబర్ పుష్పను ఆమె ప్రియుడు సందీప్.. గొంతు కోసి చంపి, ఆమెను ఉరితీశాడు. సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. మొదట్లో పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించారు, కానీ పోస్ట్మార్టం నివేదిక తర్వాత నిజం బయటపడింది. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
- Advertisement -