నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ ,పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి ని కోరారు. ముధోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆయన చైర్మన్ కు హైదరాబాద్ లో గురువారం వినతి పత్రాన్ని అందించారు. కళాశాలలోప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని, దానికి అనుగుణంగా లెక్చరర్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను నియమించాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఒక్క ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దోల్ల విఠల్, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షులు రోళ్ల రమేష్, మాజీ సర్పంచ్ అనిల్, నాయకులు ధర్మ పురి సుదర్శన్, తాటివార్ రమేష్, సాంవ్లీ రమేష్, పండిత్ రావ్ , మోహన్ యాదవ్, జీవన్, దశరథ్ , నగేష్,తదితరులున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో ఖాళీపోస్టులను భర్తీ చేయండి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES