- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు (గురువారం) తుది తీర్పు వెల్లడించనుంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే ఉత్కంఠ నెలకొంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు.
- Advertisement -