నవతెలంగాణ – గోవిందరావుపేట : జడ్పీహెచ్ఎస్ పసర పాఠశాలలో చదువుకొని 555 మార్కులు తెచ్చుకున్న నిరుపేద విద్యార్థిని బెజ్జర బోయిన స్రవంతికి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్ కుమార్ ముందుగా ప్రకటించిన విధంగా రూ.10116/-నగదు బహుమతిని గురువారం అందించారు. ఈ సందర్భంగా బహుమతిని పొందిన స్రవంతి మాట్లాడుతూ కాట్రగడ్డ.సతీష్ కుమార్ వివిధ సందర్భాలలో పాఠశాలను సందర్శిస్తూ… బాగా చదవాలని మమ్మల్ని ప్రోత్సహించాడని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తానని ముందుగానే ప్రకటించాడని దాన్ని అందుకోవడం కోసం నేను కష్టపడి చదివానని అదేవిధంగా మాకు పరీక్షలు బాగా రాయడం కోసం విలువైన స్టడీ మెటీరియల్ ని పరీక్షలకు ముందే అందజేశారని వారి మేలును మేము ఎప్పుడు మరువమని భవిష్యత్తులో నేను మంచిగా చదువుకొని వారు సంతోషించే స్థాయికి ఎదుగుతానని తెలియజేశారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ విద్యా సంవత్సరంలో కష్టపడి చదివి రాణించాలని ప్రోత్సాహకం అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వి శ్రీనివాస్ . ఓస ప్రధాన కార్యదర్శి బొబ్బ క్రాంతి కుమార్ సభ్యులు సూడి శ్రీనివాస రెడ్డి గొల్యాలనర్సిరెడ్డి ఏనుగురవీందర్ రెడ్డి, శ్రీ కర్ర సాంబశివ రెడ్డి , ఉపాధ్యాయులు
రవికుల శేఖర్ కే.సమేశ్వరరావు కే జ్యోతి కే.సమ్మయ్య
కె.జయశ్రీ .ఎం హేమలత హాజీనూరాణి
డి.రాజయ్య,కే.చంద్రారెడ్డి శారద,లక్ష్మి,నరేందర్, వెంకటేశ్వర్లు రామరాజు ఝాన్సీ పాల్గొన్నారు.