- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన మీసాల రాములు గత వారం రోజుల క్రితం మోటార్ సైకిల్ పైనుండి కిందపడి మృతి చెందారు. శుక్రవారం కుటుంబ సభ్యులు దశదినకర్మ నిర్వహించారు. పాఠశాలలో కలిసి చదువుకున్న 1992-93 పదవ తరగతి సంవత్సరానికి చెందిన చిన్ననాటి బాల్యమిత్రులు వారి కుటుంబానికి సందర్శించి రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు 26 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాజ భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జోగు శేఖర్, లక్ష్మణ్, శ్రీనయ్య, నరసింహ, శ్రీనివాస్ గౌడ్ వున్నారు.
- Advertisement -



