నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్చౌక్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్హౌస్లో మంటలు చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈఘటనలో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. భవనంలో ఉన్న మరికొందరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరణించినవారిని అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్ (2)గా గుర్తించారు. గాయపడిన వారిని ఉస్మానియా, మల్కపేట (యశోద), డీఆర్డీవో, హిమాయత్నగర్ అపోలో దవాఖానలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం ధాటికి పలువురు స్పృహ కోల్పోయారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో ఘోర విషాదం.. ఎనిమిది మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES