– వెంటనే మంటలను ఆర్పడంతో తప్పిన పెను ప్రమాదం
– పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ-బీబీనగర్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి కాచిగూడ బయలుదేరిన డెమో ప్యాసింజర్ రైలు ఇంజిన్ కింది భాగంలో మంటలు వచ్చాయి. ఈ ఘటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. రైల్వే పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు బయలుదేరిన ప్యాసింజర్ ఉదయం ఎనిమిది గంటలకు నాగిరెడ్డిపల్లి స్టేషన్ వద్దకు రాగానే రైలు ఇంజిన్ కింది భాగంలోని గేరు బాక్స్లో మంటలు వచ్చాయి. ప్రయాణికులు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయడంతో రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్లో ఆపారు. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో వివిధ రైళ్ల రాకపోకలకు సుమారు గంటపాటు అంతరాయం ఏర్పడింది.
ప్యాసింజర్ రైలు ఇంజిన్లో మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES