- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాథపురంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -



