Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరెండ్రోజుల్లో వరద నష్టం నివేదిక

రెండ్రోజుల్లో వరద నష్టం నివేదిక

- Advertisement -

– ఆ వివరాలతో ఢిల్లీకి డిప్యూటీ సీఎం
– వరద సహాయక చర్యలు, మరమ్మతు పనుల్లో వేగం పెంచండి
– కలెక్టర్లకు రూ.10 కోట్ల నిధులు
– మృతుల కుటుంబాలకు తక్షణ సాయం
– నీటి సంఘాల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి : వరదలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

భారీవర్షాలు, వరదలతో ఇటీవల దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలనీ, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పునర్నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు (ఎస్డీఆర్‌ఎఫ్‌) ఉన్నా నిబంధనల ప్రకారం వాటిని ఖర్చు చేయడంలో ఎందుకు అలసత్వం చూపుతున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినా, కేంద్రం అందించిన సహాయ సహకారాలపై ఆరా తీశారు. ఆ సమయంలో కేంద్రం ప్రకటించిన మేరకు హామీలు నెరవేర్చలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం వ్యవసాయ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిసరఫరా, వైద్యారోగ్య, విద్యుత్‌ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై రెండ్రోజుల్లో సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీటిని తీసుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతత్వంలోని బందం ఈ నెల నాలుగో తేదీ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందజేయాలని దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడిందని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సీఎం స్పందిస్తూ చిన్న నీటి పారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనీ, ఆర్‌ఆర్‌ఆర్‌, ప్రధానమంత్రి క్రిషి సంచారు యోజన, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకొని చిన్న నీటి వనరులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా సంఘాలు ఉండేవని గుర్తుచేశారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస,ి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. దీనిపై రెండ్రోజుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇస్తే, కేంద్రం దష్టికి తీసుకెళతామని సీఎం తెలిపారు. అన్ని శాఖల నుంచి వరద నష్టాల అంచనాలు తెప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుకు సీఎం సూచించారు.
చెంగిచర్ల, జియాగూడ, అంబర్‌పేట స్లాటర్‌హౌస్‌ల్లో హలాల్‌, జట్కా సక్రమంగా జరిగేలా చూడాలనీ, అధునాతన యంత్రాలు వాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలలు, ఆస్పత్రుల భవనాల పనులు వేగవంతం చేసి, ప్రారంభోత్సవ తేదీలు నిర్ణయించాలని ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. కామారెడ్డి, ఆదిలాబాద్‌, రాజన్న-సిరిసిల్ల, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక పనులు వేగవంతం చేయాలనీ, పరిహారాలు వెంటనే విడుదల చేయాలని చెప్పారు.

అన్ని శాఖలు ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు సకాలంలో వినియోగితా పత్రాలు (యూసీ) సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలు అందించడంపై సీఎం అభినందనలు తెలిపారు. భారీ వర్షాల సమయంలో 42 ఆపరేషన్లల్లో పాల్గొని 217 మందిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారని తెలిపారు. ఆ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ, నైపుణ్యాలు అందేలా చూడాలని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన, పౌర సహాయక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ నాగిరెడ్డికి సీఎం సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో మున్ముందు అకాల వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలనీ, క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో పనులకు కంటెంజెంట్‌ నిధుల నుంచి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కష్ణారావు, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకాటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శులు వి.శేషాద్రి, కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, సీఎం కార్యదర్శి కె.మాణిక్‌రాజ్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, డీజీపీ డాక్టర్‌ జితేందర్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad