- Advertisement -
నీటిలో మునిగిపోయిన రాతి శివాలయం..
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నాలుగు గేట్లను ఎత్తివేయడంతో నీటి ప్రవాహ వేగం పెరిగింది. దీంతో నది పరివాహక ప్రాంతంలో ఉన్న సోయా పంట మునిగిపోయి, దాంట్లో సైతం నీరు వచ్చి చేరింది. కందకుర్తి గోదావరి ఘాట్ సమీపంలో ఉన్న రాతి శివాలయం పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. గోదారమ్మ జలకలతో ఉట్టిపడుతోంది.
- Advertisement -