Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమూసీకి పోటెత్తిన వరద..జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

మూసీకి పోటెత్తిన వరద..జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్‌లో 8 గేట్లు, హిమాయత్‌ సాగర్‌లో 3 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌ వద్ద మూసీ నిండుగా ప్రవహిస్తున్నది. చాదర్‌ఘాట్‌ లోలెవల్‌ బ్రిడ్జిని తాకుతూ వరద వెళ్తున్నది. మరోసారి ముసారంబాగ్‌ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తున్నది.

కాగా, ఉస్మాన్‌సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి 4,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1789.45 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా హిమాయత్‌సాగర్ జలాశయానికి 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 3 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. కాగా, ప్రస్తుతం 1762 అడుగులు నీటిమట్టం ఉన్నది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -