Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeప్రధాన వార్తలుభూధార్‌ కేటాయింపులపై దృష్టి సారించాలి

భూధార్‌ కేటాయింపులపై దృష్టి సారించాలి

- Advertisement -

– మ్యుటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
– సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
– నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం : రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములకు భూధార్‌ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో అధికారులు స్వీకరించిన వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్డ్‌ సర్వేయర్లు సర్వే చేసిన తర్వాత కూడా రెగ్యులర్‌ సర్వేయర్లు వాటిని స్క్రూట్నీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్‌ అర్బన్‌ ఏరియాల్లో నూతనంగా నిర్మించనున్న 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్‌, క్యాంటీన్‌, ఇతర మౌలిక వసతులు ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందనే విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆయన వారికి సూచించారు. హైదరాబాద్‌ నగరంలోని హౌసింగ్‌ బోర్డుతో జాయింట్‌ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, సీసీఎల్‌ఏ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ. గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad