నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలములోని బిఎన్ తిమ్మాపూర్ గ్రామంలో ని గ్రామ పంచాయతీ గణేశ్ ఉత్సవ కమిటీ గణపయ్య వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో అన్నదానం నిర్వహించారు. తదనంతరం 9 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న ఘననాధుని గ్రామ పురవిధుల గుండా డోలు వాయిద్యాలతో డప్పు చప్పుళ్లతో ఉరేగించి, నిమజ్జన శోభాయాత్ర కన్నులపండుగగా నిర్వహించి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమిఉద్దీన్,మోర నర్షి రెడ్డి, ఎడ్ల దర్శన్ రెడ్డి, చిన్న సత్తి రెడ్డి, ఉడుత ఆంజనేయులు, దొంకేన అశోక్, మోర రాం రెడ్డి,వళ్ళందస్ పరమేష్,ఎడ్ల లింగా రెడ్డి, కైతపురం ఆంజనేయులు, అన్నెపు శ్రీశైలం, ఎండి బాబా,మెరుగు లక్ష్మణ్, నకిరేకంటి నరేష్, వినీల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఉడుత శ్రీశైలం, షాబీర్,సుధాకర్,నగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.