- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న ఆయన జూన్ చివరి వారంలో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం సరిగ్గా 8.56 నిమిషాలకు శిబూ సోరెన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లుగా ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ అధికారికంగా ప్రకటించారు.
- Advertisement -