- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : నాగుల్ గావ్ గ్రామానికి చెందిన జాదవ్ వసంత్ పటేల్ కుమారుడి వివాహము జుక్కల్ మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్హహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఆయన రాక చాలా సంతోషంగా ఉందని వరుడి తండ్రి వసంత్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు. షిండే వెంట జుక్కల్ బీఆర్ఎస్ నాయకులు వాస్రే రమేష్, విట్టు పటేల్ శివరాజ్ దేశాయ్, రవి పటేల్, రాజశేఖర్ పటేల్, బిచ్కుంద నాల్చార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -