నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మండలంలోని దోస్పల్లి గ్రామంలో ఉన్న ఉపపీఠం నానిజ్ రామ్ నరేంద్ర మహారాజ్ స్వామీని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగద్గురు నానిజ్ దామ్ పీఠాధిపతి స్వామీజీ నరేంద్ర మహారాజ్ స్వామీజీ ప్రవచనాలు చేశారు. సామాజికంగా ప్రజలందరూ ఏకతాటిపై ఉండి ధర్మ ప్రచారానికి కంకణ బద్దలుగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని కాపాడినప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుందని తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః అని స్వామీజీ సూచించారు. రాబోయే రోజులలో అన్ని వర్గాల వారికి స్వామీజీ దర్శన భాగ్యం కల్పించి అందరి సుఖదుఃఖాలు దూరం కావాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను ట్రస్ట్ ఆధ్వర్యంలో పూలమాలతో పీఠాధిపతి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు వాస్రే రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
స్వామిజీని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES