నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం ఘనంగా నిర్వహించారు. నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా మార్చిన దూర దృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని అని అన్నారు .
యువత రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ఆయన చారిత్రాత్మక నిర్ణయమని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ ఏఐ, టెక్నాలజీ రంగాల్లో ముందుకు దూసుకుపోతుందంటే దానికి బలమైన పునాది వేసింది రాజీవ్ గాంధీ విజన్ ఉంది అని వెల్లడించారు . దేశం కోసం, ప్రజల కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందున్న కర్తవ్యం అని చెప్పారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు, యువత సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్ , మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ , నాయకులు సాయ గౌడ్ , బొంపెల్లి విజయ్ కుమార్ , ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.