- Advertisement -
ఏడుగురు మందికి జరిమాన
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష పడింది. మరో ఏడుగురికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 11 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ నేడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరిచారు. 07 మందికి రూ.11500 /- జరిమానా విధించి, ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు చొప్పున నలుగురికి జైలు శిక్ష పడినట్లు తెలిపారు.
- Advertisement -