- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం భవనం ఆవరణ నిండా చెట్లతో ఆహ్లదాన్ని పంచుతోంది. కార్యాలయం ఆవరణలో నిండుగా ఏపుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కార్యాలయానికి నిండుగా నీడను, పచ్చని శోభను అందిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే వారికి కాసేపు సేద తీరేలా నీడనిస్తున్నాయి. కార్యాలయ భవన నిర్మాణం జరిగిన నాటి నుండి నేటి వరకు ఈ ఆఫీసులో పనిచేసే అధికారులు, సిబ్బంది తమ కార్యాలయ ఆవరణలో ఉన్న చెట్లకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాణంగా చూసుకుంటూ వస్తున్నారు.
- Advertisement -



