- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: జన్నారం నూతన ఎస్ఐగా బుధవారం గొల్లపెల్లి అనూష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాలకు లోబడి తమ పనులు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గంజాయి పై ఉక్కు పాదం మోపుతామన్నారు. మండల ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
- Advertisement -