నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డుల కార్యక్రమం తాజాగా దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమంలో ‘శివం భజే’ డైరెక్టర్ అప్సర్ సందడి చేశారు. ఆయన తెరకెక్కించిన ‘శివం భజే’ మూవీకి మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్గా అవార్డు అందుకున్నారు.
‘గంధర్వ’తో దర్శకుడిగా డిఫరెంట్ ప్రాజెక్ట్తో అప్సర్ అందరినీ మెప్పించారు. ఇక అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ మూవీని మరో డిఫరెంట్ టేకింగ్, మేకింగ్తో తెరకెక్కించారు. ‘శివం భజే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న అప్సర్ తాజాగా గామా అవార్డుల్లో సందడి చేశారు. ఆయన మూవీని తెరకెక్కించిన విధానానికి ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ ప్రాజెక్ట్ల్ని లైన్లో పెట్టారు.
అసలే ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఆడియెన్స్ను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త అనుభూతిని అందించేందుకు అప్సర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అప్సర్ తెరకెక్కించబోతోన్న చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారు.