ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తర అమెరికా, కెనడాలలో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. లవ్, మైథాలజీ, పునర్జన్మ, పీరియడ్ డ్రామా, నాలుగు యుగాల నేపధ్యంలో సాగే ఈ కథ, అద్భుతమైన వీఎఫ్ఎక్స్తో ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘గత వైభవం’ రిలీజ్కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



