నవతెలంగాణ – సుల్తాన్ బజార్ : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శంకర్ యాదవ్, జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ -14 డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ దుబ్బాక లావణ్యతో కలిసి బేగంబజార్ లో స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో పర్య టించి రోడ్లపై, బస్తీల్లో చెత్త పేరుకు పో కుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, రాంబాబు శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్, అశోక్, ఠాకూర్ సుధీర్ సింగ్, రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
బేగంబజార్ లో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES