- Advertisement -
-బీఆర్ఎస్ అధ్వర్యంలో నివేదిక ప్రతుల దగ్దం
నవతెలంగాణ – బెజ్జంకి
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం జలాశయంపై ఘోష్ కమీషన్ ఇచ్చింది తప్పుడు నివేదికంటూ మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కుట్రను నిరసిస్తూ ఘోష్ కమీషన్ నివేదిక ప్రతులను దగ్దం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి మండల బీఆర్ఎస్ శ్రేణులు వినతిపత్రమందజేశారు.
- Advertisement -