సీఎస్ రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సబ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, సమ్మిట్లో పాల్గొనే ప్రముఖులకు, దేశ, విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నట్టు తెలిపారు.
సమ్మిట్కు హాజరయ్యే వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లపై ప్రత్యేకం గా ప్రజా భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్వహిచే అతిపెద్ద సమ్మిట్లో రాష్ట్రానికి చెందిన అన్నిశాఖలు తమ పురోగతిని షో కేస్ చేయాలన్నారు. ప్రధానంగా ప్లీనరీ, ముఖ్యమంత్రి వన్ టు వన్ సమావేశాలు, వివిధ సంస్థలతో ఎంఓయూ ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 13 వరకు ఈ సమ్మిట్ కొనసాగుతుందనీ, అదే రోజు ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్తో ముగుస్తుందని వెల్లడించారు.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



