నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తాడోబా అందేరి రిజర్వ్ ఫారెస్ట్ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట కలుపుతూ కొమురం భీం జిల్లాలోని కాగజ్నగర్- ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను గజిట్లో పేర్కొంటూ తీసుకొచ్చిన ” జి.ఓ.నెం. 49 కులరం భీం కన్జర్వేషన్ రిజర్వ్” ప్రాజెక్ట్ను రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల కన్వీనర్ ఆత్రం రవి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కనికరం అశోక్ మాట్లాడుతూ..ఆ ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉంది.
ఇక్కడ గ్రామ సభ, పెసా లాంటి గిరిజన చట్టాలను అమలు పర్చకుండా ఈ గ్రామాల్లో ఎలాంటి సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయలు తీసుకోలేదు. ఇక్కడ ఈ రిజర్వ్ ఫారెస్ట్ చేపడుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, త్రీ ఫేజ్ కరెంట్, ఇతర సదుపాయాలు అన్ని ఫారెస్ట్ అధికారులు ఆపేసారన్నారు. ఈ జి.ఓ.నెం. 49 ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ జి.ఓ. 49ను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాము. లేకుంటే ఆదివాసి గిరిజన సంఘం సీపీఐ(ఎం) పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా, మండల నాయకులు ఆత్రం గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు మగ్గిడి జయ, కోరుట్ల యశోద ఓడిపెళ్లి ప్రమీల గుడ్ల రాజన్న, రైతు సంఘం జిల్లా నాయకులు కొండ గొర్ల లింగన్న, సిఐటియు జిల్లా నాయకులకు కూకటికారి బుచ్చయ్య, సిఐటియు మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్, నాయకులు దాసర్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.