నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. దింతో 4 లక్షల 43 వేల 167 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రూ.1189.43 కోట్ల నిధులు విడుదల చేసింది సర్కార్. ఇప్పటి వరకు 19 లక్షల 82, 392 ఎకరాలకు రైతు భరోసా అందింది.
ఇప్పటి వరకు 62 లక్షల మంది రైతులకు రూ 6404.70 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాగా తెలంగాణ రాష్ట్ర రైతులకు అలర్ట్. తెలంగాణలో రైతు భరోసా డబ్బులు పొందని వారికి మరో అవకాశాన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు భరోసా డబ్బులు పొందని వారు ఈనెల 20 లోపు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీనికోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. rythubharosa.telangana.gov.in/ నుంచి కూడా ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లోకి 30వేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES