నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలోని దమ్మన్నపేట్ వడ్డెర కాలనీ, ఏకలవ్య నగర్ లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారని, విద్యార్థులలో దాగివున్న నైపుణ్యలను వెలికి తెస్తూ, విలువలు కలిగిన విద్యను అందిస్తారన్నారు. ముఖ్యంగా విద్యార్థులలో క్రమశిక్షణను పెంచుతూ విద్య నేర్పిస్తారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, సుమలత, శిరీష, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నందగిరి లలిత, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES