నవతెలంగాణ – వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రాజన్న కోడెల సంరక్షణ కోసం అత్యాధునిక వసతులతో, సువిశాలమైన నూతన గోశాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలనీ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఖతార్ పర్యటనలో భాగంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాష్ట్రనికి తిరిగి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని తెలిపారు. ఇటీవల రూ.200 కోట్లతో వేములవాడ నియోజకవర్గనికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరి చేయడం పట్ల, ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, డిలీమిటేషన్ కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు. ఖతార్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి వివరించారు. రాజన్న ఆలయంలో జరగబోవు అభివృద్ధి,గోశాలలో జరుగుతున్న పలు అంశాలపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోశాలలోని కోడెలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని, అత్యాధునిక వసతులతో సువిశాలమైన స్థలంలో నూతన గోశాల నిర్మాణం కోసం స్థల సేకరణ చేయాలని వారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, కోడెలు అనారోగ్య బారిన పడకుండా ప్రభుత్వం తరుపున, ఆలయం తరుపున తగు జాగ్రత్తలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES