సీఎం రేవంత్రెడ్డితో కలిసి వారికి సన్మానం
పాల్గొన్న మంత్రులు జూపల్లి, పొన్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్భవన్లో మిస్వరల్డ్-2025 పోటీల విజేతలకు అభినందన కార్యక్రమం సోమవారం చేపట్టారు. విజేతలకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. మిస్ వరల్డ్ ఓపల్ సుచాతా చుయాంగ్ శ్రీ(థాయిలాండ్), ఆఫ్రికా కాంటినెంటల్ విజేత ఈథియోపియా హస్సెట్ దేరేజే, యూరప్ కాంటినెంటల్ విజేత మజ క్లాజ్డా (పోలాండ్), అమెరికన్- కరీబియన్ కాంటినెంటల్ విజేత ఆరెల్ల జోఅచ్ఛిమ్ (మార్టినిక్) తదితరులు పాల్గొన్నారు. వారిని గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించారు. గిరిజనులు తయారుచేసిన అటవీ ఆకులతో రూపొందించిన స్వాగత వేదిక వద్ద విజేతలు ఫొటో షూట్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డితో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విజేతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
మిస్వరల్డ్-2025 విజేతలకు గవర్నర్ తేనీటి విందు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES