- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్ : విద్యార్థులలో పర్యావరణ అవగాహన, స్థిరత్వాన్ని పెంపొందించడానికి మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల యందు శుక్రవారం గ్రీన్ డే వేడుకలను నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నాగాయి భోజన్న, ప్రధానో పాధ్యాయుడు పిల్లమారి శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. చెట్ల పెంపకం, పర్యావరణ అనుకూల కార్యకలాపాలు ఆకుపచ్చ నేపథ్య సంఘటనలు తదితర అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు వివరించినారు. పచ్చని భవిష్యత్తును ప్రోత్సహించడంలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -