నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల నూతన భవనానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ.. ప్రత్యేక పాఠశాల మండల కేంద్రానికి రావడం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాల రావడం చాలా గర్వ కారణం. ఈ భావన వ్యయం దాదాపు రూ.9 లక్షలు. ఈ పాఠశాల భవనంతో మండల కేంద్రంలోని దాదాపు 200 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ ప్రత్యేక విద్యతోపాటు, క్రీడా, ప్రత్యేక కార్యక్రమాలు అందేవిధంగా కృషి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ నితిన్ కాంప్లెక్స్ ఇన్చార్జి హెడ్మాస్టర్ పండిత్, కల్పన, ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య, భవ్య, సాయన్న కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్, సి ఆర్ పి లు షాయద్, సాయిలు, రామారావు, అంగన్వాడీ టీచర్ పద్మ, దివ్యాంగులు పాల్గొన్నారు.
ప్రత్యేక పాఠశాల భవనానికి భూమి పూజ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES