నవతెలంగాణ-హైదరాబాద్: జిఎస్టి సంస్కరణలతో కేంద్రానికి రూ.3,700 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని ఎస్బిఐ తెలిపింది. జిఎస్టి రేట్ల హేతుబద్ధీకరణతో నికర ఆర్థిక ప్రభావం వార్షిక ప్రాతిపదికన రూ.48,000 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. వృద్ధి, వినియోగం పెరుగుదల దృష్ట్యా, కనీస ఆదాయ నష్టం రూ.3,700 కోట్లుగా అంచనా వేయబడిందని, ఆర్థిక లోటుపై ఎటువంటి ప్రభావం చూపదని ఎస్బిఐ నివేదిక తెలిపింది. జిఎస్టి రేటు హేతుబద్ధీకరణ అర్థవంతమైన వ్యయ సామర్థ్యాల కారణంగా బ్యాంకింగ్ రంగంపై ఎక్కువగా సానుకూల ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. జిఎస్టి హేతుబద్ధీకరణలో అత్యవసర వస్తువులపై (సుమారు 295) 12శాతం నుండి 5 శాతం లేదా జీరోకి చేరడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ (సిపిఐ) ద్రవ్యోల్బణం కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గి 30 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది. మొత్తం మీద, 2026-27 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 65 బేసిస్ పాయింట్ల నుండి 75 బేసిస్ పాయింట్లకు క్షీణించవచ్చని ఎస్బిఐ నివేదిక తెలిపింది.
జిఎస్టి సంస్కరణలతో కేంద్రానికి రూ.3,700 కోట్ల ఆదాయ నష్టం: SBI
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES