- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం తీరంలో నిన్న సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ఘనంగా గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భక్త బృందం పాల్గొనగా, శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీతారాం త్యాగి మహారాజ్ భక్త బృదం అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -