కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : దళిత విద్యార్థిని విద్యార్థులు బాత్రూములు కడగాలి తరగతి గదులు హాస్టల్ రూములు శుభ్రం చేసుకోవాలి అని దళిత విద్యార్థులను కించపరుస్తూ మాట్లాడిన గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని ని తక్షణమే సస్పెండ్ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సలవాల నర్సయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణిని వెంటనే మార్చాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేవీపీస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి దళితుల్ని అవమానపరిచిన తీరు చాలా అబ్యంతరకరమన్నారు. దళిత పిల్లలు వారు ఏమైనా రాజ సింహాసనం నుంచి వచ్చారా? వారేమైనా రాజులా అన్నట్టు వెటకారంగా మాట్లాడిన సెక్రటరీ అలుగు వర్షిణి వెంటనే సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. అలుగు వర్షిని తమ ఆఫీసు బాత్రూంలను వారే కడుక్కుంటున్నారా? ఆఫీసు రూములను వారే ఊడ్చుకుంటున్నారా? సెలవివ్వాలన్నారు. ఒక ఐఏఎస్ అధికారి విద్యార్థిలోకాన్ని అవమానించడం శోచనీయమన్నారు. దేశంలో వేల సంవత్సరాల నుంచి అన్నిరకాల అవమానాలకు బాధలను భరిస్తున్న దళిత విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదిగే వారిని సైతం అవమానిస్తూనే ఉంటారా?అని ప్రశ్నించారు. ఈ అవమానాలతో వారి చదువులు ఎలా సాగాలి తక్షణమే అలుగు వర్షిని తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. గురుకులాల సెక్రటరీ బాధ్యతలు నుంచి ఆమెను తక్షణమే తప్పించాలి. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు.
అలుగు వర్షిని మొత్తం దళిత సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగం వల్ల ఈరోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలు చదువులు, ఆటలు, ఉద్యోగాల్లో రాణిస్తుంటే అది చూసి ఓర్వలేక ఒక ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి ప్రవర్తన యావత్ దళితసమాజాన్ని అవమానపరిచే విధంగా ఉందన్నారు. గురు కులాలకు వచ్చే పిల్లలు ఏమైనా రాజభవనం నుండి వస్తున్నారా? ఏమైనా సింహాసనం నుండి వస్తున్నారా ? వారు వచ్చేది పూరి గుడిసెల నుంచే కాబట్టి వారు వచ్చి వారి పనులు వారు చేసుకొని చదువుకోవాలని అవమానించడం తగదన్నారు. ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడే సెక్రెటరీ మా గురుకులాలకు అవసరం లేదని వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఆమె దళితుల పట్ల దళిత విద్యార్థి విద్యార్థినీ, విద్యార్థుల పట్ల ఎలాంటి పనులు చేపిస్తాదో కూడా ఆమె ఉద్దేశం అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా మంత్రివర్గంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ, నేతలు వివేక్ వెంకటస్వామి లాంటి వారు చొరవ తీసుకుని ఆమెను సస్పెండ్ చేయించి గురుకులాలను కాపాడి దళిత విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వింత ప్రవర్తన యావత్ దళిత విద్యార్థుల భవిష్యత్ కు నష్టం జరుగుతుందన్నారు. ఆమెని వెంటనే గురుకుల నుంచి తొలగించి దళిత బడుగు బలహీన వర్గలకు నాయ్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకంటే ఇలాంటి అధికారుల వల్ల విద్యార్థిని విద్యార్థులు చదవలేక, అటు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇలాంటి అధికారులను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేసి గురుకులాలకు న్యాయం చేయాలని, అలుగు వర్షిణికి డ్రైవర్, ఇంట్లో వంట వాళ్ళు ఎందుకు? ఆమె పనులు ఆమె చేసుకుంటే చాలా బాగుంటదన్నారు. తను ఒక ఆఫీసర్ గా ఉండి కూడా అన్ని అనుభవిస్తూ రాజభోగాలు అనుభవిస్తూ దళితుల పట్ల వివక్ష పూరితంగా మాట్లాడటం సబబు కాదన్నారు. ఇలాంటి అధికారి గురుకులాలకు సెక్రటరీగా ఉండరాదని, ఆమెను వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వం తెలంగాణ గురుకులాలు కాపాడాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉద్యమాల్ని ఉదృతం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్ ,జిల్లా నాయకులు జంగం గంగాధర్, సంపత్, రాజు, విశాల్, తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల సెక్రెటరీ వర్షిణిని సస్పెండ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES